chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

NTR Vijayawada Local News :కె.ఎల్. విశ్వవిద్యాలయం వేదికగా ఈ నెల 18 నుండి 20 వ తేదీ వరకు రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలు

విజయవాడ:డిసెంబర్ 17:-రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు యువజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్.భరణి తెలిపారు.

గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో ఉన్న కె.ఎల్. విశ్వవిద్యాలయం వేదికగా ఈ ఉత్సవాలు జరగనున్నాయని చెప్పారు. యువతలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఉత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయిలో ఎంపికైన యువతీ యువకులు వివిధ సాంస్కృతిక, కళాత్మక, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జానపద నృత్యాలు, జానపద గీతాలు, శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, నాటకాలు, చిత్రలేఖనం, కవిత్వం, కథా రచన, ప్రసంగం, క్విజ్, ఫోటోగ్రఫీ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు.NTR VIJAYAWADA News

ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన యువతీ యువకులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే ఎంపికైన విజేతలకు జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లు, యువజన సేవల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు సంచాలకులు ఎస్.భరణి తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker