chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :కాకతీయ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా-మాదల చైతన్య

గుంటూరు:-ఎన్టీఆర్ గారు మన మధ్య లేకపోయి 30 ఏళ్లు అవుతున్నా, తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని జన చైతన్య ప్రాపర్టీస్ అధినేత మాదల చైతన్య అన్నారు.

Guntur Local News :కాకతీయ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా-మాదల చైతన్య

ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు నగరంలోని ఐపిడి కాలనీ 5వ లైన్ వద్ద కాకతీయ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు మాదల చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాదల చైతన్య మాట్లాడుతూ, తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరం స్థాయికి తీసుకెళ్లిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి రాజకీయ చరిత్రలో చెరిగిపోని అధ్యాయాన్ని సృష్టించారన్నారు. దేశానికి సుపరిపాలనకు అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.

Guntur Local News :కాకతీయ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి వేడుకలకు ముఖ్య అతిథిగా-మాదల చైతన్య

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీఆర్ అని, విద్యావంతులు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పిస్తూ టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. అనేక మంది మేధావులు, సమర్థులు, విద్యావంతులను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు.Guntur nagaram lo

ఈ కార్యక్రమంలో కాకతీయ సేవ సమితి ప్రతినిధులు గోగినేని హరికృష్ణ, గోగినేని శంకర్రావు, బత్తిన శివయ్య, ఆలపాటి వెంకట కృష్ణ, చల్లగుండ్ల వెంకటేశ్వరరావు, ఈదర శ్రీనివాసరావు, పాటిబండ్ల శ్రీనివాసరావు, కందిమల్ల హరికృష్ణ, పుట్టగంటి వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker