
కందుకూరు: ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు ఒకే చోట అందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ప్రణవి పిల్లల కంటి హాస్పిటల్’ ఏప్రిల్ 20వ తేదీ (20-04-2026) ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. స్థానికులకు మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో పీడియాట్రిక్, ఆప్తాల్మాలజీ (కంటి వైద్యం), న్యూరాలజీ విభాగాలకు చెందిన ఆధునిక పరికరాలను ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కె. హరీకృష్ణ కుమార్ (నియోనాటాలజిస్ట్ & పీడియాట్రిషన్), డాక్టర్ సునీత ప్రకాంతి (కంటి వైద్య నిపుణురాలు), డాక్టర్ కె. https://youtu.be/I8VKfyX2ahA?si=0F-H1MHT1ZB6yJt8
సత్యనారాయణ (బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్) ఇక్కడ నిరంతరం తమ సేవలను అందించనున్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుకకు జిల్లా వైద్య అధికారి కె. రామ్మోహన్ రావు, ప్రముఖులు ఇంతియాజ్ నాగేశ్వరరావు, డాక్టర్ దీప్తి సుధా వెంకటేశ్వర్లు, కె. కేశవేంద్రరెడ్డి, సంకర్ కృష్ణ, దయానంద దాసు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కావున, కందుకూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని ఆసుపత్రి నిర్వాహకులు ఒక ప్రకటనలో కోరారు.http://PRAKASHAM DISTRICT NEWS







