chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 పల్నాడు జిల్లా

KARAMPUDI NEWS:కారంపూడిలో భీకర రోడ్డు ప్రమాదం- ఆటో,బైక్ ఎదురెదురుగా ఢీ.. ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

కారంపూడి (పల్నాడు జిల్లా), మార్చి 09: కారంపూడి పట్టణ శివారులోని మాచర్ల రోడ్డులో ఉన్న ఓల్డ్ మాట్రిక్స్ పవర్ ప్లాంట్ సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న బైక్ మరియు ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటకు తరలించారు.

ప్రమాదం జరిగిందిలా..

స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి సుమారు 10:50 గంటల సమయంలో కారంపూడి పట్టణం నుండి ఒకే బైక్‌పై ముగ్గురు యువకులు అడిగొప్పుల తిరునాళ్లకు వెళ్తున్నారు. అదే సమయంలో ఒప్పిచర్ల గ్రామం నుండి కారంపూడి వైపు వస్తున్న ఆటో.. పవర్ ప్లాంట్ ఆపోజిట్‌ వద్ద బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

క్షతగాత్రుల వివరాలు:

ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులతో పాటు ఆటోలో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

  • సాగిబోయిన విష్ణు (20): బైక్ నడుపుతున్న ఈ యువకుడికి తలకు బలమైన గాయం కావడంతో పాటు చెయ్యి, కాలు విరిగాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైమరీ ట్రీట్‌మెంట్ అనంతరం నరసరావుపేట ఆసుపత్రికి రిఫర్ చేశారు.
  • సూరేపల్లి సాయి (20): తలకు గాయమైంది.
  • కొండా నితీష్ (20): స్వల్ప దెబ్బలతో బయటపడ్డారు.
  • గొడుగు గురవయ్య (36 – ఆటో డ్రైవర్): తలకు గాయమైంది.
  • వేలుపూరి అంజి (48): ముక్కు నుండి తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు కాలు విరిగింది.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.Palnadu district Telugu local news: పల్నాడు జిల్లా తెలుగు లోకల్ న్యూస్

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker