Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్

Amazing Karthika Vanasamaradhana: Spiritual Reflection, Joy, Health – ₹14 Lakh Scholarships for 140 Students||అద్భుత కార్తీక వనసమారాధన: ఆధ్యాత్మిక చింతన, ఆనందం, ఆరోగ్యం – 140 మందికి రూ. 14 లక్షల Scholarships!

Amazing Karthika Vanasamaradhana: Spiritual Reflection, Joy, Health – ₹14 Lakh Scholarships for 140 Students||అద్భుత కార్తీక వనసమారాధన: ఆధ్యాత్మిక చింతన, ఆనందం, ఆరోగ్యం – 140 మందికి రూ. 14 లక్షల Scholarships!

కార్తీక వనసమారాధన ఆధ్యాత్మిక చింత‌న‌, ఆనందం ఆరోగ్యం సందేశం క‌ల‌యిక….క‌మ్మ సంఘం ఆధ్వ‌ర్యంలో కార్తీక వ‌న‌స‌మారాధ‌న

ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య‌, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్, ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు నెట్టెం ర‌ఘురామ్ వెల్ల‌డి

140 మంది పేద విద్యార్ధుల‌కు రూ.14 లక్ష‌ల సాల్క‌ర్ షిప్ లు అంద‌జేత

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ :

కార్తీక వ‌న‌స‌మారాధ‌న ఆధ్యాత్మిక చింత‌న‌, ఆనందం ఆరోగ్యం సందేశం క‌ల‌యిక అని ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య‌, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ పేర్కొన్నారు. పేద‌వారికి సాయం చేసేందుకు అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే సమాజంలో మార్పు సాధ్యమన్నారు.

కార్తీక మాసం సందర్భంగా ఆదివారం నందిగామలోని నెహ్రు నగర్ కమ్మ కళ్యాణ మండపంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో వనసమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి కృష్ణాజిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం , విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ , ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు.

నందిగామ చిరుమామిళ్ల శేషాద్రి నాయుడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వనసమారాధనలో, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు , చిరుమామిళ్ల శేషాద్రి నాయుడు చిత్రపటాల‌కు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు ప్రజలతో కలసి ఆధ్యాత్మిక కార్తీక వన సమారాధన వాతావరణాన్ని ఆస్వాదించారు.

ఆధ్యాత్మికతతో కూడిన వనభోజనం కార్తీక వనభోజనాలు మనకు ఆనందం, ఆరోగ్యం, ఐక్యత అనే సందేశాన్ని అందిస్తాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సమాజంలో మార్పు రావాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండి పేదవారికి తోడ్పాటు అందించాలనే ఆవశ్యకతను వారు స్పష్టం చేశారు.

సేవా కార్యక్రమంలో భాగంగా కమ్మ సంఘం ఆధ్వర్యంలో 140 మంది పేద విద్యార్థులకు మొత్తం 14 లక్షల రూపాయల స్కాల‌ర్ షిపులు అందజేయడం జరిగినది. ఈ సహాయం విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడుతుందని, సమాజంలో సమానత్వం పెంపొందుతుందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి , మాజీ ఎమ్మెల్యే బొద్దులూరి రామారావు , కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కోగంటి బాబు , విజ‌య‌వాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ బోర్డ్ సభ్యురాలు మన్నే కళావతి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జా అజయ్, కామినేని కోటేశ్వ‌ర‌రావు ల‌తో పాటు కమ్మ సంఘం సభ్యులు, కూటమి నేతలు, మహిళలు, యువతి యువత, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button