
పాట్నా (బీహార్): బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన కేంద్ర విద్యాశాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పాట్నాలో మర్యాదపూర్వకంగా కలిశారు.
బీహార్లో ఎన్డీఏ విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాన్కు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. గతంలో హర్యానా, ఒడిశా ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రధాన్ కీలకంగా వ్యవహరించారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు బీహార్లో కూడా అదే ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన కృషి సనీయమని లోకేష్ అన్నారు.బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కాగలదన్న నమ్మకాన్ని లోకేష్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్తో ఎంపీలు సానా సతీష్, గంటి హరీష్, కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు.







