chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

Machilipatanam Local News :మిల్లర్లు, రైతులకు ధాన్యం సేకరణకు అవసరమైన వాహనాలను, గోతం సంచులను సమకూర్చాలి-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం: డిసెంబర్‌ 15:-జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మిల్లర్లను కోరారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలు, గోనె సంచులను సమకూర్చి పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు.

సోమవారం రాత్రి నగరంలోని కలెక్టరేట్ “మీకోసం” సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి జిల్లాలోని మిల్లుల యజమానులతో ధాన్యం సేకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 149 కంబైన్డ్ హార్వెస్టర్ల ద్వారా వరి కోతలు సాగుతున్నాయని, దీంతో ఒకేసారి భారీగా ధాన్యం సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ప్రభుత్వం పెద్ద ఎత్తున గోనె సంచులు, వాహనాలు సమకూర్చినప్పటికీ అవి పూర్తిగా సరిపోవడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు తమ వద్ద ఉన్న గోనె సంచులు, వాహనాలను కూడా వినియోగంలోకి తెచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు.

జిల్లాలో ఇప్పటికే 75 శాతం వరి కోతలు పూర్తయ్యాయని, ప్రస్తుతం 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ధాన్యాన్ని తీసుకునేందుకు మిల్లర్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, రోజుకు 20 వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం సేకరించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అలాగే బ్యాంకు గ్యారంటీలను సిద్ధం చేసుకోవాలని, కోత కోసిన వెంటనే రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని బాగా ఆరబెట్టేందుకు మిల్లుల వద్ద ఉన్న డ్రైయర్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తున్న 1318 రకం వరి ధాన్యాన్ని కూడా తప్పనిసరిగా సేకరించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు త్వరలో మరో 10 లక్షల గోనె సంచులు రానున్నట్లు తెలిపారు.సమావేశంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాం ప్రసాద్, జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వీరయ్యతో పాటు పలువురు మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker