chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
అమరావతిఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

మహిళలకు గార్మెంట్ పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు,టైలరింగ్ శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు – మంత్రి ఎస్. సవిత

అమరావతి:25 9 25 :- మహిళా సాధికారితపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం, గార్మెంట్ పరిశ్రమల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. శాసనసభా సమావేశాల్లో గురువారం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఈ విషయాన్ని తెలియజేశారు.

“మహిళా శక్తీకరణకు సీఎం చంద్రబాబు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక్క మహిళను పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దాలన్నదే ఆయన లక్ష్యం. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి,” అని మంత్రి పేర్కొన్నారు.

మాజీ ప్రభుత్వం (2019-24) మహిళల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించిన ఆమె, చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.

ఈ క్రమంలోనే ఏపీ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, కోర్సు పూర్తి చేసిన వారికి కుట్టు మిషన్ ఉచితంగా అందించడంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇస్తున్నట్టు చెప్పారు.

శిక్షణ కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని, హాజరు నమోదు కోసం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి కల్పించేందుకు పలు గార్మెంట్ సంస్థల యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నామని, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థతో కలిసి ముందుకెళ్తున్నామని మంత్రి సవిత వివరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker