
మంగళగిరి, నవంబర్ 2:-మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఉదయం ఎయిమ్స్ వైద్యశాల సమీపంలోని ఎకో పార్క్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది.అధ్యక్షుడిగా కృష్ణ, గౌరవాధ్యక్షుడిగా పూర్వ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా ఆలేటి పూర్ణ, చంద్రకేవి వెంకట దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా కే. శంకరరెడ్డి, సహాయ కార్యదర్శులుగా డోగిపర్తి నరేంద్ర, బాణాల నాగేశ్వరరావు, ట్రెజరర్గా నేరెళ్ల లక్ష్మణ్ ఎన్నుకోబడ్డారు.
కార్యవర్గ సభ్యులుగా కుక్కమళ్ళ ప్రభాకర్, షేక్ అహ్మద్ షరీఫ్, తిరువీధుల నరసింహమూర్తి, కనిగిరి శ్రీరాములు, రుద్రు మోహన్ లు ఎంపికయ్యారు.సలహా కమిటీ సభ్యులుగా మంచా విజయ్ మోహన్, జిలాని, అంకం శ్రీనివాసరావు (బాబు), ఎలీషా, విఠల్ రావు, వీసం వెంకటేశ్వరరావు, హరిశ్చంద్ర ప్రసాద్, బాణాల రామారావు, కొమ్మారెడ్డి వీరారెడ్డి, జంజనం వెంకట సాంబశివరావు, గోలి బాలమోహన్, షేక్ హుస్సేన్ లను ఎన్నుకున్నారు.ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం రెండేళ్లపాటు కొనసాగుతుందని వీసం వెంకటేశ్వరరావు తెలిపారు. వాకర్స్ మధ్య ఇటీవల నెలకొన్న విభేదాలను పీకే కళాశాల మాజీ ప్రిన్సిపాల్, పూర్వ గౌరవాధ్యక్షుడు మరియు తాజా సలహా కమిటీ సభ్యుడు మంచా విజయ్ మోహన్ రావు సమర్థంగా పరిష్కరించి సమన్వయం సాధించినట్లు తెలిపారు.







