
బాపట్ల : 15 డిసెంబర్ 2025:-రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసిల్దార్ కార్యాలయాల్లో నమోదయ్యే ప్రతి అర్జీని తప్పనిసరిగా పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. ఆదేశించారు.సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు వీక్షణ సమావేశం ద్వారా హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా కలెక్టర్కు విన్నవించుకున్నారు. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపగా, మరికొన్నిటిని పరిశీలనకు, విచారణకు ఆదేశించారు. మొత్తం 173 అర్జీలు నమోదు అయ్యాయి.

రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్ని మండల కార్యాలయాల్లో తప్పనిసరిగా పీజీఆర్ఎస్ జరగాలన్నారు. అధికారులకు అందిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు ముందుగా తహసిల్దార్ కార్యాలయంలో అర్జీలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు, అక్కడ కూడా పరిష్కారం లభించని పక్షంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలని వివరించారు. ఈ విధానం ప్రజలకు అర్థమయ్యేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. పంచాయతీ శాఖ, డీఆర్డీఏ, చీరాల మున్సిపాలిటీ, వేటపాలెం తహసిల్దార్ పరిధిలో పెండింగ్ అర్జీలపై ఆరా తీశారు. పునరావృత అర్జీలలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినవి 54 నమోదు కావడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్ అర్జీలపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని సూచించారు.
ఇ-ఆఫీస్ విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ విధానంలో ఒకే రోజులో 9 గంటల్లో బాపట్ల జిల్లా నుంచి 1,363 ఫైళ్లను పరిశీలించి పరిష్కరించడం ద్వారా రాష్ట్రంలోనే 7వ స్థానం సాధించామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు.Bapatla Local News ఖజానా శాఖలో ఇ-ఫైల్స్ నమోదు లేకపోవడంపై ఆరా తీసి, నిర్లిప్తత వహించకుండా కచ్చితంగా ఫైలింగ్ జరగాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా సంయుక్త కలెక్టర్, డీఆర్వో జి. గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు తదితరులు పాల్గొన్నారు.
బాపట్ల 15 డిసెంబర్ 2025;-రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసిల్దార్ కార్యాలయాల్లో నమోదయ్యే ప్రతి అర్జీని తప్పనిసరిగా పీజీఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి. ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు వీక్షణ సమావేశం ద్వారా హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను వినతిపత్రాల ద్వారా కలెక్టర్కు విన్నవించుకున్నారు. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపగా, మరికొన్నిటిని పరిశీలనకు, విచారణకు ఆదేశించారు. మొత్తం 173 అర్జీలు నమోదు అయ్యాయి.
రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్ని మండల కార్యాలయాల్లో తప్పనిసరిగా పీజీఆర్ఎస్ జరగాలన్నారు. అధికారులకు అందిన ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు ముందుగా తహసిల్దార్ కార్యాలయంలో అర్జీలు సమర్పించాలని, అక్కడ పరిష్కారం కాకపోతే ఆర్డీఓకు, అక్కడ కూడా పరిష్కారం లభించని పక్షంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలని వివరించారు. ఈ విధానం ప్రజలకు అర్థమయ్యేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు.
సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. పంచాయతీ శాఖ, డీఆర్డీఏ, చీరాల మున్సిపాలిటీ, వేటపాలెం తహసిల్దార్ పరిధిలో పెండింగ్ అర్జీలపై ఆరా తీశారు. పునరావృత అర్జీలలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినవి 54 నమోదు కావడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్ అర్జీలపై ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని సూచించారు.
ఇ-ఆఫీస్ విధానాన్ని అధికారులు అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ విధానంలో ఒకే రోజులో 9 గంటల్లో బాపట్ల జిల్లా నుంచి 1,363 ఫైళ్లను పరిశీలించి పరిష్కరించడం ద్వారా రాష్ట్రంలోనే 7వ స్థానం సాధించామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. ఖజానా శాఖలో ఇ-ఫైల్స్ నమోదు లేకపోవడంపై ఆరా తీసి, నిర్లిప్తత వహించకుండా కచ్చితంగా ఫైలింగ్ జరగాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా సంయుక్త కలెక్టర్, డీఆర్వో జి. గంగాధర్ గౌడ్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు తదితరులు పాల్గొన్నారు.







