chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

మంగళగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో “సూపర్ జీఎస్టీ సేవింగ్స్”పై అవగాహన కార్యక్రమం

మంగళగిరి, అక్టోబర్ 10:వ్యాపార మరియు వ్యవసాయ రంగాలకు ఊతమివ్వడమే లక్ష్యంగా, మంగళగిరి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో శుక్రవారం “సూపర్ జీఎస్టీ సేవింగ్స్” పై అవగాహన కార్యక్రమం జరిగింది. సేల్స్ టాక్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వ్యాపారవేత్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.guntur11

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, సూపర్ జీఎస్టీ విధానంతో వ్యాపారులకు, రైతులకు గణనీయమైన ఉపశమనం లభిస్తోందన్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, కీటకనాశకాలు, పశువుల ఆహారం, వ్యవసాయ యంత్రాలు వంటి అవసరమైన వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గించడముతో రైతులకు ఉత్పత్తి ఖర్చులు తగ్గి లాభదాయకత పెరుగుతోందని వివరించారు.

నగర పాలక సంస్థ కమిషనర్ అలీమ్ భాష మాట్లాడుతూ, “చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులు తక్కువ పన్నులతో తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాన్ని పొందుతున్నారు. అలాగే విద్యుత్ పరికరాలు, వైద్య సరఫరాలు, నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గడంతో సామాన్య ప్రజల ఖర్చులు తగ్గాయి” అని పేర్కొన్నారు.

మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ మాట్లాడుతూ, “సూపర్ జీఎస్టీ ద్వారా మార్కెట్ స్థిరత ఏర్పడుతోందని, నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయని” పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ మినహాయింపు, తగ్గుదలలను వివరించే ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు ప్రదర్శనను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల, ఆర్టీఓ బాలకృష్ణ, టీడీపీ నేతలు సంకా బాలాజీ గుప్తా, అల్లక నమశ్శివాయ, రైతు సంఘాల ప్రతినిధులు, మార్కెట్ కమిటీ అధికారులు తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker