chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍బాపట్ల జిల్లాఆంధ్రప్రదేశ్

Mega Parents Program at Vetapalem ZP High School, Bapatla District a huge success

బాపట్ల జిల్లా వేటపాలెం జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్ కార్యక్రమం ఘనవిజయం

వేటపాలెం:
వేటపాలెం జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ కార్యక్రమం Principal దేవరకొండ సరోజినీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఉపాధ్యాయుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, అతిధులు భారీగా హాజరయ్యారు. విద్యార్థులు పూల వర్షంతో అతిధులను ఆహ్వానించడం విశేష ఆకర్షణగా నిలిచింది.

తరగతి వారీగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విద్యార్థుల విద్యాభివృద్ధిపై చర్చించారు. విద్యార్థులు తమ తల్లులకు పూలతో పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు పొందడం హృద్యంగా సాగింది. ఈ పాఠశాల 117 సంవత్సరాల గొప్ప చరిత్రను ఉపాధ్యాయుడు సోమశేఖర్ వివరించారు.

ప్రస్తుత మరియు పూర్వ విద్యార్థులు తమకు ఈ పాఠశాల అందించిన విద్యా సేవలను ప్రశంసించారు. తల్లిదండ్రులతో పిల్లలను పాఠశాలకు నిరంతరం పంపించడంపై, ఇంట్లో వారికి సమయం కేటాయించడంపై, మంచి అలవాట్లు అలవరుచుకోవడంపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ జె.వి. సుబ్బయ్య మాట్లాడుతూ పిల్లలను సెల్‌ఫోన్లు, చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచాలని సూచించారు.

అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పునాది వేశారు. కార్యక్రమానంతరం సహపంక్తి భోజనం నిర్వహించబడింది. వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker