
రేపల్లె: స్థానిక వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ నందు శంకర్ EYE హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 24వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. కీ”శే” శ్రీమతి కొండపనేని ఉదయ భాస్కర ప్రసాద్ మరియు కీ”శే” వెంకట గోపాలరావు దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయిగిరిధర్ గారి సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి సోదరులు శ్రీ అనగాని శివప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని పర్యవేక్షించారు.

పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందించాలనే సంకల్పంతో ఇటువంటి ఉచిత శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, తల్లిదండ్రుల స్మృత్యర్థం సాయిగిరిధర్ గారు చేస్తున్న ఈ కృషి ఎందరికో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు గారు, ఇతర ముఖ్య నాయకులు, వైద్య సిబ్బంది మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.TODAY BAPATLA NEWS







