మంగళగిరి: 10-10-25:-కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడి వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన మామయ్య, సినీ నటుడు మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో కలిసి హాజరయ్యారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో వైభవంగా నిర్వహించిన ఈ వివాహ మహోత్సవంలో నూతన వధూవరులు సందీప్, బిందు శ్రీలను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
కూటమిలోని పలువురు ప్రముఖ నేతలు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వివాహ కార్యక్రమం అందంగా, ఉత్సాహంగా జరిగింది.