
బాపట్ల:-బాపట్ల నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా అర్హులైన లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయం అందించారు. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ నిధి – సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.18,99,436/- విలువ గల చెక్కులను 31 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ దృక్పథానికి ఇది నిదర్శనమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరిస్తూ, ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు.Bapatla Local News వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా మద్దతు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. అర్హులైన వారు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవాలని, మరింత మందికి ఈ సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు:
- ఇమ్మడిశెట్టి బసవరాజు – రూ.1,59,336/- (బాపట్ల పట్టణం, ఇమ్మడిశెట్టివారిపాలెం)
- దొంతిన వెంకట రామిరెడ్డి – రూ.1,24,335/- (నాగేంద్రపురం)
- కంచర్లపల్లి నరేష్ – రూ.1,22,220/- (నర్రావారి వీధి)
- ఆవులు పోలమ్మ – రూ.1,15,969/- (రామచంద్రాపురం)
- కీర్తి కోటేశ్వరరావు – రూ.1,13,467/- (మంతెనవారిపాలెం)
- గుంటూరు కృష్ణ కమల కార్తికేయ – రూ.1,05,343/- (రైలుపేట)
- అబ్దుల్ కలాం – రూ.1,03,740/- (ఇస్లాంపేట)
- పేరం అశోక్ రెడ్డి – రూ.1,01,822/- (మర్రిపూడి)
- కుక్కల తాతి రెడ్డి – రూ.89,928/- (పాండురంగాపురం)
- మన్నెం స్వాములు – రూ.83,912/- (జి.యన్. పాలెం)
- నసిమున్నిసాబేగం – రూ.82,478/- (నదిముల్లాయపాలెం)
- ముప్పలనేని విజయలక్ష్మి – రూ.81,000/- (నరసాయపాలెం)
- మంతెన ఆంజనేయ రాజు – రూ.51,310/- (ఖాజీపాలెం)
- గుండ్రెడ్డి వెంకట సుబ్బారావు – రూ.45,624/- (ఖాజీపాలెం)
- మద్దిబోయిన పోలిరాజు – రూ.41,084/- (ఈస్ట్ పిన్నిబోయినవారిపాలెం)
- నర్ర పవన్ కుమార్ మణికంఠ – రూ.39,500/- (తుమ్మలపల్లి)
- గవిని నాగరాజు – రూ.37,724/- (బాపట్ల పట్టణం)
- బెజవాడ రామారావు – రూ.37,539/- (ఖాజీపాలెం)
- మల్లోలు స్వాతి – రూ.37,477/- (7వ వార్డు, బాపట్ల)
- మందపాటి సౌభాగ్యమ – రూ.35,437/- (బిడారుదిబ్బ)
- నక్కా పద్మ – రూ.31,365/- (చెరువు జమ్ములపాలెం)
- కట్టా పైబా – రూ.30,786/- (నరసాయపాలెం)
- చింతమనేని వెంకట సుబ్బయ్య – రూ.30,786/- (గుడిపూడి)
- కొమరాబత్తిన హెజ్రా – రూ.30,000/- (ఖాజీపాలెం)
- షాహేద బేగం – రూ.28,400/- (నదిముల్లాయపాలెం)
- జెస్టి వెంకటేశ్వరరావు – రూ.27,900/- (గుడిపూడి)
- గరికపాటి నాగరాజు – రూ.24,534/- (భర్తిపూడి)
- మందపాటి ఆనందరావు – రూ.22,896/- (బిడారుదిబ్బ)
- యల్లావుల పోరురాజు – రూ.21,500/- (మంతెనవారిపాలెం)
- పెనుమత్స బసవరాజు – రూ.21,500/- (బుద్ధాం)
- ఉరవకొండా పెద వెంకయ్య – రూ.20,524/- (దమ్మన్నవారిపాలెం)
ఈ కార్యక్రమం ద్వారా సీఎం సహాయ నిధి అవసరమైన కుటుంబాలకు ఆపదలో అండగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.







