chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Amaravathi news మొంథా’ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష – అధికారులకు కీలక ఆదేశాలు

అమరావతి, అక్టోబర్ 29:రాష్ట్రాన్ని వణికిస్తున్న ‘మొంథా’ తుపాను నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితిని సమీక్షించారు. తుపాను తీరం దాటినప్పటికీ పలు జిల్లాల్లో ఇంకా తీవ్ర వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై పవన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.డిప్యూటీ సీఎం తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించారు. తుపాను ప్రభావంతో విస్తృతంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను తక్షణం పునరుద్ధరించాలంటూ అధికారులను ఆదేశించారు.

పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన ప్రజలకు వసతి, ఆహారం సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. నదులు ఉద్ధృతంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, వంతెనలపై గమనించమని సూచించారు.వర్షాల అనంతరం పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసి, అవసరమైన చోట రక్షణ బృందాలను సమన్వయం చేయాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ప్రజల భద్రతే ప్రాధాన్యం. అధికారులు పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో ఉండాలి. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం సహించం,” అని హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker