ఆంధ్రప్రదేశ్గుంటూరు
MANGALAGIRI NEWS: మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి
MINISTER LOKESH
ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న వంద రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహవీర్ గోశాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. హోలీ సందర్భంగా చిన్నారులకు లోకేశ్ రంగులు పూశారు. అనంతరం రమేశ్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేశ్, పెమ్మసాని చంద్రశేఖర్ను మార్వాడీలు ఘనంగా సన్మానించారు.