Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

MPDO dhanalakshmi :ఎంపీడీవో ధనలక్ష్మి గ్రామ సర్పంచి వై నారాయణ రావు చేతుల మీదుగా రుణ చెక్కుల పంపిణీ

Bapatla:చినగంజం:28-11-25:- మండలంలో వెలుగు డీఆర్‌డీ ఆధ్వర్యంలో వివిధ పథకాల కింద ఆర్థిక సహాయాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో ధనలక్ష్మి, గ్రామ సర్పంచి వై. నారాయణరావు హాజరయ్యారు.బ్యాంక్ ఆఫ్ బరోడా, చింతగుంపల బ్రాంచ్ ద్వారా మొత్తం రూ.25 లక్షల 50 వేల రూపాయలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అందులో భాగంగా PMEGP పథకం కింద ధారా విజయలక్ష్మికి డీజే యూనిట్ స్థాపన కోసం రూ.10 లక్షల రుణం మంజూరు కాగా, అందులో రూ.3.50 లక్షలు సబ్సిడీగా లభించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన రూ.6.50 లక్షలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది.

MPDO dhanalakshmi :ఎంపీడీవో ధనలక్ష్మి గ్రామ సర్పంచి వై నారాయణ రావు చేతుల మీదుగా రుణ చెక్కుల పంపిణీ

అదే విధంగా, బెజ్జం రమాదేవికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ యూనిట్ కోసం రూ.5 లక్షలు PMEGP కింద ఆమోదం లభించింది. ఇందులో రూ.1,75,000 సబ్సిడీగా అందనున్నట్లు ఎంపీడీవో ధనలక్ష్మి వెల్లడించారు.అలాగే మరో ఐదుగురు లబ్ధిదారులకు ముద్ర పథకం కింద మొత్తం రూ.10 లక్షల 50 వేల రుణాలను మంజూరు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ధనలక్ష్మి మాట్లాడుతూ, “యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి ఈ పథకాలు ఎంతో దోహదపడతాయి. మన ప్రాంత యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలి” అని సూచించారు.గ్రామ సర్పంచి వై. నారాయణరావు మాట్లాడుతూ, “మా గ్రామంలో యువత అభివృద్ధికి ప్రభుత్వం ఇలాంటి మంచి అవకాశాలు కల్పించడం అభినందనీయం. లబ్ధిదారులు ఈ సహాయాలను సద్వినియోగం చేసుకొని స్వావలంబన దిశగా ముందుకు సాగాలి” అని అన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker