chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

NTR vijayawada Local news :ముగిసిన వ్యవసాయ కళాశాల, బాపట్ల విద్యార్థుల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం

ఎన్టీఆర్:పెనుగంచిప్రోలు:12-12-25:-శివాపురం గ్రామంలో వ్యవసాయ కళాశాల, బాపట్ల విద్యార్థులు నిర్వహించిన జాతీయ సేవా పథకం (NSS) ప్రత్యేక శిబిరం వారాంతంతో ముగిసింది. డిసెంబర్ 6 నుంచి 12 వరకు సాగిన ఈ శిబిరంలో విద్యార్థులు గ్రామాభివృద్ధి, ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి విభిన్న సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.శిబిరం చివరి రోజు కార్యక్రమాలు12.12.2025న చివరి రోజు భాగంగా విద్యార్థులు శివాపురం మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం (రి.నెం. 2001/13) భవనాన్ని శుభ్రపరచి, గోడలకు—తలుపులకు పెయింటింగ్ చేశారు. అదనంగా గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటారు.శిబిరం ముగింపు సభరైతు సేవ కేంద్రంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, “విద్యార్థులు గ్రామస్తుల సహకారంతో ఏడు రోజులపాటు విలువైన కార్యక్రమాలను నిర్వహించారు,” అని తెలిపారు.

ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలుడిసెంబర్ 6:ప్రారంభోత్సవంతోపాటు ఇంటింటా సర్వే నిర్వహించి గ్రామ సమస్యలపై అవగాహన.డిసెంబర్ 7:స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ముళ్లకంపలతో కప్పబడ్డ ప్రభుత్వ ప్రాంతాల్లో శుభ్రపరచడం, వాడుకలో లేకున్న చేతి పంపును మళ్లీ పనిచేసేలా తయారు చేయడం. పరిశుభ్రతపై ర్యాలీ.డిసెంబర్ 8:ప్లాస్టిక్ వినియోగం, దాని దుష్ప్రభావాలపై ర్యాలీ. గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ–దహనం.డిసెంబర్ 9:వయ్యారిభామ కలుపును తొలగించడం. కలుపు నివారణపై అవగాహన ర్యాలీ.డిసెంబర్ 10:బొజ్జ దంత వైద్యశాల, జగ్గయ్యపేట సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరం—మందుల పంపిణీ.డిసెంబర్ 11:కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు, పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం.96 పాడిపశువులు, 104 మేకలను పరీక్షించి—వ్యాధుల నివారణ ఇంజెక్షన్లుఅవసరమైన మందులు, మినరల్స్, యోటిక్స్కృత్రిమ గర్భధారణ సేవలుమేకలకు నట్టల మందుల పంపిణీగ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలుశిబిరం నిర్వహణలో సహకరించిన పంచాయతీ సర్పంచ్ టి. లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ ఎల్. మోహనరావు, గ్రామస్తులకు విద్యార్థులు, కళాశాల తరఫున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

NTR JILLAపాల్గొన్నారుకృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డా. రవి కిషోర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. బి. రవీంద్రారెడ్డి, డా. అబ్దుల్ సలాం, డా. పి. సుధా జాకబ్, డా. వి. సీతారామ్ బాబు, NSS వాలంటీర్లు, శివాపురం గ్రామస్తులు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker