
భట్టిప్రోలు:- బాపట్ల జిల్లా మేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు శ్రీ నక్కా ఆనంద బాబు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు.

భట్టిప్రోలు గ్రామంలో భట్టిప్రోలు PACS సొసైటీ పక్కన ఉన్న మార్కెట్ యార్డ్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా CMRF చెక్కులు పంపిణీ చేశారు.Bapatla Local News ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం పేదలు, నిరుపేదలు, అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తునగుంగుంట్ల సాయిబాబు, వాకా శేషుబాబు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.










