
నాందేడ్: ప్రముఖ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గురువారం నాందేడ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అతిథి హోదాలో ఘన స్వాగతం పలికింది.

నాందేడ్లోని శ్రీ గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు శ్రీ అశోక్ చవాన్, భోకార్ శాసన సభ్యురాలు శ్రీమతి శ్రేయా చవాన్, శాసన మండలి సభ్యులు శ్రీ రాజార్ కర్, నాందేడ్ జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ ఖరడ్లే తదితరులు శ్రీ పవన్ కళ్యాణ్ను ఆత్మీయంగా స్వాగతించారు.

అనంతరం ఆయన బస చేసే ప్రాంతం వద్ద నాందేడ్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీ అజిత్ సావే, రాజ్యసభ సభ్యులు శ్రీ అజిత్ గోప్చడే, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు శ్రీ రాజేంద్ర కోడగే తదితరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు.Hyderabad- Amaravathi
శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.










