chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News :న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే మూలస్తంభం- జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

గుంటూరు:డిసెంబరు 21 :-న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే మూలస్తంభమని సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. గుంటూరులోని రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీలో నిర్వహించిన “రాజ్యాంగ దృక్కోణం – జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర” అనే జాతీయ స్థాయి సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం చేశారు.

Guntur Local News :న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే మూలస్తంభం- జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

ప్రపంచంలోనే భారత న్యాయ వ్యవస్థ అతి పెద్దదిగా ఉందని, అనేక దేశాల రాజ్యాంగాల కంటే ఉత్తమ విలువలు భారత రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన తెలిపారు. న్యాయ వ్యవస్థలో ప్రతి అంశం రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ న్యాయమూర్తులు ప్రశాంతత, స్థైర్యం, ఓర్పుతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

Guntur Local News :న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే మూలస్తంభం- జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

సామాన్య ప్రజలకు న్యాయం చేరువ కావడంలో జిల్లా న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని, కోర్టులో జరిగే విచారణ ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. తీర్పులు ఇవ్వడమే కాకుండా, తీర్పులో నిబద్ధత, న్యాయమూర్తి ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యమని అన్నారు.GUNTUR

సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా న్యాయం మానవతా దృక్కోణంతోనే సాగాలని స్పష్టం చేశారు. ల్యాండ్‌మార్క్ తీర్పులకే కాకుండా, రోజువారీ కేసులను నిష్పక్షపాతంగా పరిష్కరించడమే నిజమైన న్యాయ సేవ అని చెప్పారు. రాజ్యాంగ విలువలు కాపాడటం ప్రతి న్యాయమూర్తి బాధ్యతగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జ్యుడిషియల్ అకాడమీ పాట్రన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, జిల్లా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైనదన్నారు. జీవించే హక్కు అంటే కేవలం జీవించడమే కాకుండా, గౌరవప్రదమైన జీవితం గడపడం అని తెలిపారు. రాజ్యాంగాన్ని సమర్థంగా పరిరక్షించడమే దానికి ఇచ్చే నిజమైన గౌరవమని అన్నారు.

Guntur Local News :న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థే మూలస్తంభం- జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా

హైకోర్టు న్యాయమూర్తి, జ్యుడిషియల్ అకాడమీ బోర్డు ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిల్హారి మాట్లాడుతూ, రాజ్యాంగం ఇచ్చిన పౌర హక్కులను జిల్లా న్యాయ వ్యవస్థ పటిష్టంగా రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసులను సున్నితంగా, సరైన విధానంతో పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న న్యాయ అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker