
గుంటూరు, నవంబరు 7 :-జాతీయ కేడెట్ దళం (ఎన్సిసి) ఆధ్వర్యంలో “ఐడియా & ఇన్నోవేషన్ కాంపిటీషన్ (IIC) – 2025” జాతీయ స్థాయి కార్యక్రమం ఈ నెల 10 నుండి 16వ తేదీ వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరగనుంది. ఈ విషయాన్ని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలిందర్ సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.దేశవ్యాప్తంగా ఉన్న ఎన్సిసి డైరెక్టరేట్లకు చెందిన సుమారు 340 మంది కేడెట్లు పాల్గొననుండగా, “వికసిత్ భారత్ @2047” లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని సృజనాత్మకత, సాంకేతిక ప్రతిభ, నూతన ఆలోచనల ప్రదర్శనకు ఈ వేదిక అవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి, రక్షణ, విద్య, యువజన శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారని తెలిపారు.ఈ ఐడియా అండ్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ యువ కేడెట్లలోని సృజనాశక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలను వెలికితీసి దేశ నిర్మాణం, స్వావలంబన దిశగా మలుస్తుందని కల్నల్ బలిందర్ సింగ్ పేర్కొన్నారు. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన “ఆత్మనిర్భర్ భారత్” ఆలోచనకు అనుగుణంగా ఉందని చెప్పారు.
వారం పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో వర్క్షాపులు, ఇన్నోవేషన్ ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు నిర్వహించనున్నారని తెలిపారు. సాంకేతికత, పర్యావరణం, రక్షణ, లాజిస్టిక్స్, స్టార్ట్అప్ / ఎంట్రప్రెన్యూర్షిప్ వంటి రంగాల్లో నిజజీవన సమస్యలకు పరిష్కారాలపై కేడెట్లు తమ ఆవిష్కరణలను ప్రజెంట్ చేయనున్నారు.రాష్ట్రంలో విద్య, ఆవిష్కరణ, యువశక్తి రంగాల్లో పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ కార్యక్రమం స్పష్టంగా ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. శాస్త్రీయ దృష్టి, పరిశోధన, నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.దేశం నలుమూలల నుండి వచ్చిన కేడెట్లు ఐక్యత ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఈ పోటీ కేవలం ఆవిష్కరణలను గుర్తించడమే కాకుండా యువతను కొత్త ఆలోచనల దిశగా ప్రేరేపించి, భవిష్యత్తులో దేశ అభివృద్ధికి దోహదం చేసే పరిష్కారాలుగా మలచడం లక్ష్యమని ఆయన తెలిపారు.కార్యక్రమాల షెడ్యూల్ (10-16 నవంబర్ 2025):10 నవంబర్: దేశం నలుమూలల నుండి వచ్చే కేడెట్ల నమోదు11–14 నవంబర్: నిపుణుల వర్క్షాపులు, డైరెక్టరేట్ ప్రజెంటేషన్లు15 నవంబర్: ఫైనల్ ప్రజెంటేషన్లు, బహుమతి ప్రదానం, సాంస్కృతిక సాయంత్రం16 నవంబర్: ముగింపు కార్యక్రమం







