Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆధ్యాత్మికం📍 విశాఖపట్నం జిల్లా

నేడు విశాఖలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన

విశాఖపట్నం, అక్టోబర్ 12:విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ నేడు విశాఖపట్నం పర్యటన చేపట్టారు. ఉదయం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రుషికొండలోని హిల్ నెంబర్-3 ప్రాంతంలో ఏర్పాటు కానున్న సిఫీ (Sify) సంస్థ ఆధ్వర్యంలో నిర్మించబోయే ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS) ప్రాజెక్ట్‌కు కూడా శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టులు విశాఖపట్నంలో డిజిటల్ మౌలికసదుపాయాలను మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేష్ కలెక్టరేట్‌కి వెళ్లి జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పాలనాపరమైన సమస్యలపై చర్చించి, పరిష్కార మార్గాలను సూచించే అవకాశం ఉంది.మధ్యాహ్నం మంత్రి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంకు వెళ్లి, మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా జరుగనున్న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button