
విజయవాడ, జనవరి 27:-జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా ఎన్.టి.ఆర్. జిల్లా ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపిఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీమతి షిరిన్ బేగం ఐపిఎస్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ మోహన్ గార్ల సారథ్యంలో ఈ కార్యక్రమం విజయవాడలోని వ్యాస్ కాంప్లెక్స్ ట్రాఫిక్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది.

ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు, రోడ్డు రవాణా శాఖ అధికారులు, విద్యార్థినీ–విద్యార్థులకు మోటార్ వెహికల్ చట్టంపై లోతైన అవగాహన కల్పించారు. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త చట్ట సవరణలను సవివరంగా వివరించారు. రహదారి ప్రమాదాల్లో గాయపడిన బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి చట్టపరంగా నగదు బహుమతులు అందించే నిబంధనలు ఉన్నాయని, అటువంటి సందర్భాల్లో వారికి ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.

ఫీల్డ్ స్థాయిలో ట్రాఫిక్ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న వివిధ అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. అలాగే హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు అందించే నష్టపరిహార విధానాలపై (Victim Compensation Procedures) పాల్గొన్న వారికి స్పష్టమైన సమాచారం అందించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహనతో పాటు బాధ్యతాభావం పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.Vijayawada Local News :అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం










