AP NEWS: రాష్ట్రానికి రూ.259 కోట్లు అదనపు కేంద్ర నిధులు కోరిన మంత్రి సత్యకుమార్ యాదవ్
AP MINISTER STHYAKUMAR MEET WITH CENTRAL MINISTER
కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు ఇతర మంత్రులతో న్యూఢిల్లీలో భేటీ అయిన మంత్రి
సత్యకుమార్ యాదవ్. జాతీయ ఆరోగ్య మిషన్(NHM), ఇతర పథకాల కింద రాష్ట్రానికి అదనంగా రూ.259 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరిన మంత్రి. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తో సమావేశమైన మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున కేంద్ర ప్రభుత్వం పలు పథకాల కింద పునఃకేటాయింపులు చేస్తుంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుంచారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూ.800 కోట్ల మేరకు పునఃకేటాయింపుల కింద అదనపు నిధుల్ని కోరింది. వీటిలో ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి రూ.109 కోట్లు విడుదల చేయాలని కేంద్ర వైద్య, ఆర్థిక శాఖా మంత్రుల్ని కోరిన మంత్రి సత్యకుమార్. పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద రాష్ట్రానికి మరో రూ.150 కోట్లు విడుదల చేయాలని కోరిన మంత్రి సత్యకుమార్. కేంద్ర టూరిజం, న్యాయ, అణుశక్తి శాఖా మంత్రులతో కూడా సమావేశమైన మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రానికి చెందిన పలు విషయాలపై చర్చించిన మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి, క్యాన్సర్ చికిత్సల విషయంలో అదనపు కేంద్ర సాయాన్ని కోరిన మంత్రి సత్యకుమార్