chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Prchuru Local News :ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైన ఎన్టీఆర్ గారి సేవలను స్మరిస్తూ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు ఘనంగా నివాళులర్పించారు.

Prchuru Local News :ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ఈ సందర్భంగా ఏలూరి క్యాంప్ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఇంకొల్లు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.Bapatla Local News

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు మాట్లాడుతూ…
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ గారని, రాజకీయాల్లో విలువలు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన అసమాన నాయకుడని కొనియాడారు. పేదల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, మహిళల సాధికారతకు ఎన్టీఆర్ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన బాధ్యత మనందరిదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని “జోహార్ ఎన్టీఆర్” నినాదాలతో ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker