chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Jaggayyapet Local News :నూరు సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ – దోనేపూడి శంకర్

జగ్గయ్యపేట:పెనుగంచిప్రోలు :-భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నూరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని కర్ల లింగయ్య కళాభవన్ సీపీఐ కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభకు ముందు మండలంలోని ముచ్చింతాల, అనిగండ్లపాడు గ్రామాల నుంచి కమ్యూనిస్టు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చారు. పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, అనిగండ్లపాడు గ్రామాల సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పట్టణంలో ఉత్సాహంగా సాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ, నూరు వసంతాల ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమేనని అన్నారు. విద్యార్థి, కార్మిక, రైతు, యువజన, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన పార్టీ సీపీఐ అని తెలిపారు.http://ntr vvijayawada news

అనేక భూపోరాటాలు చేసి, తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతు తెలుపుతూ వందల మందికి భూములు పంపిణీ చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఎలాంటి సహకారం అందించని బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు నేడు దేశాన్ని పాలిస్తున్నాయనే ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పంచభూతాలను కూడా ఆదానీ, అంబానీ ల స్వంతమయ్యేలా పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పేద ప్రజల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులపై తప్పుడు కేసులు బనాయించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. విశాఖలో యువజన, కార్మిక సంఘాలపై పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దేశంలో మతోన్మాదం, హింస పెరుగుతున్న ఈ తరుణంలో యువత ముందుకు వచ్చి భారత కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా, సంఘవిద్రోహ శక్తులను ఎదుర్కొని పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు బుడ్డి రాయప్ప, సీనియర్ నాయకులు వల్లంకొండ బ్రాహ్మం, మాజీ ఎంపీపీ పొన్నం నరసింహారావు, చల్లాల శివాజీ (సిద్ధాంతి), పద్మాల వెంకటేశ్వరరావు, నంబూరి చలపతిరావు, కనకపుడి బాబురావు, అంబోజి శివాజీ, మాశెట్టి రమేష్‌బాబు, షేక్ జానీ, అసదుల్లా, అనిగండ్లపాడు శర్మ, ఆర్టీసీ మీరా, భోగ్యం నాగులు, షేక్ కరీం, కరిసే మధు, పద్మాల మునసొబు, జక్కులూరి వెంకటేశ్వర్లు, నలగర్ల పెద్దలింగయ్య, వేల్పుల కాంతయ్య, ఇంటూరి ప్రవీణ్, కటారపు కన్నయ్య, గడ్డం శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, వల్లంకొండ భాస్కరరావు, ముళ్లపాటి వెంకటేశ్వర్లు, రామారావు, కనకపుడి మరియమ్మ, జక్కులూరి వెంకటరావమ్మతో పాటు మహిళా కార్యకర్తలు, కమ్యూనిస్టు శ్రేణులు పాల్గొన్నారు.

ముందుగా కర్ల లింగయ్య కళాభవన్‌పై రైతు సంఘం నాయకులు చుండూరు సుబ్బారావు ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయం ముందు అమరవీరుల స్థూపం వద్ద దోనేపూడి శంకర్ అరుణపతాకాన్ని ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు.


Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker