
ఒంగోలు:- నగరంలో విషాద వాతావరణం నెలకొంది. మేదరమెట్ల శంకరారెడ్డి దశదినకర్మ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది.
ఒంగోలు బచ్చల బాలయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన మేదరమెట్ల శంకరారెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యులు, చీరాల మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి హాజరై శంకరారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అలాగే చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ బాబు కూడా కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా శంకరారెడ్డి సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.ఒంగోలులో పాయల్ రాజ్పూత్ సందడి||Payal Rajput’s Visit to Ongole
కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










