Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
పల్నాడుఆంధ్రప్రదేశ్

PALNADU NEWS : తూబాడులో సీసీరోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనుల పరిశీలన

తాగునీటి సరఫరా, చెరువులు..లిఫ్ట్ ల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించను : మాజీమంత్రి ప్రత్తిపాటి లింగంగుంట్ల తాగునీటి చెరువును, కుప్పగంజివాగు లిఫ్ట్ ను పరిశీలించిన ప్రత్తిపాటి. తూబాడులో సీసీరోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనుల పరిశీలన నియోజకవర్గంలోని తాగునీటి చెరువుల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, చెరువుల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసి, గట్లపై మంచి మొక్కలు పెంచాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలోని మంచినీటిచెరువును, కుప్పగంజి వాగుపై ఉన్న ఎత్తిపోతలపథకాన్ని (లిఫ్ట్) మాజీమంత్రి బుధవారం గ్రామస్తులతో కలిసి పరిశీలించారు.3 గ్రామాలకు తాగునీరు అందించే చెరువును జాగ్రత్తగా నిర్వహించండి. చెరువులోని పూడిక తొలగించి చుట్టూ మొక్కలు పెంచండి.చెరువులోని పూడికను వేసవిలోనే తొలగించాలని, ఎలాంటి నాచు, తూటికాడసహా, ఇతర వ్యర్థాలు లేకుండా చూడాలని, చెరువు గట్టుపై మంచి మొక్కలు పెంచాలని పుల్లారావు ఆర్.డబ్ల్యూఎస్ మరియు పంచాయతీ అధికారుల్ని ఆదేశించారు. గ్రామస్తులు కూడా చెరువును రక్షణలో ప్రభుత్వ సిబ్బందికి సహకరించాలన్నారు. చెరువుకు నీటి సరఫరాకోసం కుప్పగంజి వాగుపై రూ.25లక్షలతో ఇటీవలే మరమ్మతులు చేసిన లిఫ్ట్ ను పరిశీలించిన మాజీమంత్రి, అధికారులకు పలుసూచనలు చేశారు. లిఫ్ట్ ను జాగ్రత్తగా వినియోగించాలని, పైపులైన్ల నుంచి నీరు వృథా అవ్వకుండా చూడాలని, లీకేజ్ లను తక్షణమే సరిచేయాలని చెప్పారు. ఇటీవలే లిఫ్ట్ కు మరమ్మతుల చేసినందున మోటార్లను జాగ్రత్తగా వినియోగించాలని చెప్పారు. లిఫ్ట్ పాడైతే తాగునీటికి ఇబ్బంది అవుతుందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా పనిచేయాలన్నారు. వేసవిలో ఒక్కరోజు నీటిసరపరా నిలిచిపోయినా అనేక సమస్యలు తలెత్తుతాయనే విషయాన్ని అధికారయంత్రాంగం విస్మరించకూడదన్నారు. లిఫ్ట్ ద్వారా లింగంగుంట్ల,కావూరు, పురుషోత్తమపట్నం గ్రామాలకు తాగునీరు, 2586 ఎకరాలకు సాగునీరు అందుతుందనే నిజాన్ని గుర్తించి పనిచేయాలని మాజీమంత్రి సూచించారు. సొంతనిధులతో లిఫ్ట్ మరమ్మతు పనులు చేయించిన నీటిసంఘం అధ్యక్షులు భైరా సంజీవరావును ఆయనకు సహకరించిన లింగంగుంట్ల గ్రామ టీడీపీ నాయకులు తూబాటి కిశోర్, పెడవలి చంద్రశేఖర్, గ్రామ రైతుల్ని ప్రత్తిపాటి పేరుపేరునా అభినందించారు. సమస్యను గుర్తించి లిఫ్ట్ ను పునరుద్ధరణలో గ్రామస్తులంతా ఒకే మాటపై ఉండి పనిచేయడం నిజంగా మెచ్చుకోవాల్సిన అంశమన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button