Parchur:కంచర్ల రామయ్య మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సంతాపం
సీనియర్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు లోని ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య గారి మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విద్యాభివృద్ధికి సమాజాభివృద్ధికి, రామయ్య కృషి మరువలేనిదన్నారు.వివిధ దినపత్రికల్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన రామయ్య పలు సమస్యలపై తన కలం ద్వారా ప్రజల గళాన్ని వినిపించారన్నారు. ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఎందరి నో జర్నలిస్టులు గా తీర్చిదిద్ది, యూనియన్ లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. రామయ్య మృతి ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.