
పర్చూరు :- పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (సాంబన్న) గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారి సహకారంతో నోవా అగ్రి గ్రూప్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఉదయం నుంచే కంటి వైద్య శిబిరానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. పేదలు, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. అర్హులైన వారికి ఉచిత చికిత్స, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా గ్రామ గ్రామాన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, రైతుల సంక్షేమం, యువతకు ప్రోత్సాహమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరై ఎమ్మెల్యే సాంబన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.Parchuru Local News :పంటల నమోదు పకడ్బందీగా జరగాలి – ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు










