
బాపట్ల:- త్వరలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఎంతో కీలకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమారి సూచించారు.
బాపట్లలోని ఎన్నారై జూనియర్ కళాశాలలో స్టూడెంట్స్ ఇంటలెక్చువల్ ఫోరం సహకారంతో ఏర్పాటు చేసిన “ఈ తరంలో మేము ప్రత్యేకం” అనే విద్యార్థుల మోటివేషన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పరీక్షల సమయంలో ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా స్పష్టమైన ప్రణాళికతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు. మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకుని, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. సమయపాలనతో ఉపాధ్యాయులు అందించే శిక్షణను ఏకాగ్రతతో స్వీకరించి, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు. తల్లిదండ్రుల ఆశయాలు, గురువుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తన ఉండాలని పేర్కొన్నారు.
అనంతరం ప్రముఖ అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ రూపొందించిన, భారత ప్రభుత్వ కాపీరైట్స్ డిపార్ట్మెంట్ నుండి పేటెంట్ పొందిన “ఈ తరంలో మేము ప్రత్యేకం” ప్రతిజ్ఞ ప్రతులను విద్యార్థులకు అందజేశారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఎస్.எన్.వి. ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డి. వెంకటేశ్వర్లు, ఎ.జి.ఎం. కృష్ణారావు, ఏ.వో.వై. నాగరాజు తదితరులు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.










