chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Amaravathi local News :పాఠశాల విద్య నుంచే ఆరోగ్య సూత్రాల బోధన అవసరం– ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు

అమరావతి, జనవరి 29 :– పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు బోధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోగా–నేచురోపతి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు సూచించారు. ఆరోగ్యకరమైన జీవన విధానంపై చిన్న వయసు నుంచే అవగాహన కల్పిస్తే భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.

అమరావతిలో కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ, ఆయుష్ కమిషనర్ దినేష్ కుమార్, ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ నీలకంఠారెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు గురువారం సందర్శించారు.

ఈ సందర్భంగా మంతెన సత్యనారాయణ రాజుతో జరిగిన సమావేశంలో ‘యోగా–నేచురోపతి ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ’ అంశంపై చర్చించారు. విద్యార్థుల దినచర్యలో ప్రతిరోజూ 30 నిమిషాల యోగాభ్యాసం, 15 నిమిషాల ధ్యానంను తప్పనిసరిగా చేర్చాలని ఆయన సూచించారు.

మిల్లెట్ ఆధారిత, ప్రొటీన్ సమృద్ధి ఆహారాన్ని ప్రోత్సహించడం ద్వారా ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ లక్ష్యాన్ని సాధించవచ్చని మంతెన పేర్కొన్నారు. యోగా, నేచురోపతిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని అధికారులకు హామీ ఇచ్చారు.Amaravathi news

ఆరోగ్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, ప్రజల్లో అవగాహన పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన చర్యలపై అధికారులకు మంతెన సత్యనారాయణ రాజు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆరోగ్యాలయం వాతావరణం, నిర్వహణ తీరు, అందిస్తున్న సేవల పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker