Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Jaggaiahpet News:పత్తి కొనుగోలుకు మద్దతు ధర అమలు చేయాలి-తన్నీరు నాగేశ్వరరావు

NTR Vijayawada:జగ్గయ్యపేట, అక్టోబర్ 15:జగ్గయ్యపేట నియోజకవర్గంలో పత్తి సాగు చేసిన రైతుల నుంచి పత్తిని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ. 8,110/- కు వెంటనే కొనుగోలు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

బుధవారం పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “జగ్గయ్యపేట నియోజకవర్గంలో సుమారుగా 20 వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం రైతులు దళారీల దుర్మార్గాల నుంచి నష్టాలు చవిచూస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే రైతుల నుంచి పత్తిని నేరుగా కొనుగోలు చేయాలి” అని అన్నారు.ఇంకా మాట్లాడుతూ, “మున్ముందు మూడు రోజుల్లో జగ్గయ్యపేట మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. లేదనుకుంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల హక్కుల కోసం ఉద్యమాలు చేపడతాం” అని హెచ్చరించారు.ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర చేనేత విభాగం అధికార ప్రతినిధి పెంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button