Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Unexpected Farmer Welfare: $20,000 Financial Assurance to Krishna District with ‘Annadata Sukhibhava’||అనూహ్యమైన రైతు సంక్షేమం: ‘Annadata Sukhibhava’తో కృష్ణాజిల్లాకు $20,000 ఆర్థిక భరోసా

Unexpected Farmer Welfare: $20,000 Financial Assurance to Krishna District with 'Annadata Sukhibhava'||అనూహ్యమైన రైతు సంక్షేమం: 'Annadata Sukhibhava'తో కృష్ణాజిల్లాకు $20,000 ఆర్థిక భరోసా

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లవోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్
రైతులు పండించే పంటకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం- పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందని స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక భరోసాని ఇస్తుందని అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రైతులు మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి, భూమి సాగు చేసుకునే కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, పిఎం కిసాన్ పథకం ద్వారా రూ. 6 వేలు ఆర్థిక సహాయం రైతులకు అందజేస్తున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ- పిఎం కిసాన్ ద్వారా పెడన నియోజకవర్గంలో 24,202 మంది రైతులకు గానూ 16 కోట్ల 3 లక్షలు నిధులు జమ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడు విడతలలో రైతులకు రూ. 20 వేలు అందజేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అన్నదాత కుటుంబాల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమం అభివృద్ధి పనులు చేపడుతూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు

Unexpected Farmer Welfare: $20,000 Financial Assurance to Krishna District with 'Annadata Sukhibhava'||అనూహ్యమైన రైతు సంక్షేమం: 'Annadata Sukhibhava'తో కృష్ణాజిల్లాకు $20,000 ఆర్థిక భరోసా

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button