chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Pedana jayalakshmi:పెడన జయలక్ష్మి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం కొత్త పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

పెడన, నవంబర్ 1:_పెడన జయలక్ష్మి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం కొత్త పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని, యర్రపోతు నాగేశ్వరరావును అధ్యక్షుడిగా, బూసం డొలంబ మరియు కూనపరెడ్డి రంగయ్య నాయుడును సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, “రైతులను ఇబ్బంది పెట్టే అధికారులను అసలు సహించము,” అని స్పష్టం చేశారు. కూటమి నాయకుల సహకారంతోనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి నాయకులను ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ, జయలక్ష్మి ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం రైతుల సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. పాలకవర్గ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన యర్రపోతు నాగేశ్వరరావు సంఘాన్ని అన్ని విధాలా అభివృద్ధి దిశగా నడిపించాలని కోరారు.

రైతుల ఆకాంక్షల మేరకే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు కొరియర్ శ్రీను, పట్టణ టీడీపీ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య, అబ్దుల్ ఖయ్యాం (హన్ను), చందన నారాయణరావు, కౌన్సిలర్ మట్టా శివపావని, టీడీపీ నాయకుడు కమ్మగంటి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker