chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

PGRS Bapatla: 151 Dynamic Grievances Addressed by Joint Collector || PGRS బాపట్ల: 151 ఫిర్యాదులపై జాయింట్ కలెక్టర్ డైనమిక్ నిర్ణయం

PGRS Bapatla: 151 Dynamic Grievances Addressed by Joint Collector || PGRS బాపట్ల: 151 ఫిర్యాదులపై జాయింట్ కలెక్టర్ డైనమిక్ నిర్ణయం
      పిజిఆర్ఎస్ సమస్యలను మండల స్థాయిలో అధికారులు పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు.

    పి జి ఆర్ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ కు వినతి పత్రాల ద్వారా విన్నవించారు. 151 అర్జీలు పిజిఆర్ఎస్ లో నమోదు అయ్యాయి. మాకు న్యాయం చేయండి అంటూ అర్జీదారులు అధికారులను కోరారు. తన పరిధిలోని వాటికి అక్కడికక్కడే ఆమె పరిష్కార మార్గం చూపారు. కొన్నిటిని పరిశీలన, మరికొన్నింటిని విచారించాలని తక్షణమే సంబంధిత అధికారులకు పురమాయించారు. ప్రజల సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని ఆయన సూచించారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజల నుంచి ఆర్జీల స్వీకరణ జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం ఇదే క్రమాన్ని పాటించాలని సూచించారు. నమోదైన అర్జీలను పరిశీలించిన, తదుపరి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. గత వారంలో మండల, డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించిన పి జి ఆర్ ఎస్  కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 566 అర్జీలు నమోదు అయ్యాయన్నారు. ప్రజాప్రతినిధుల వద్దను పి జి ఆర్ ఎస్ జరుగుతుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

    గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజభవన్ లో నిర్వహించే కార్యక్రమంలో సామాజిక సేవ పాల్గొనే వారికి అవార్డుల ప్రదానం జరుగుతుందని జిల్లా సంయుక్త కనెక్ట్ చెప్పారు. సమాజంలో మంచి సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, వివిధ సంస్థలు, సామాజిక సేవలు అందిస్తున్న వారిని గుర్తించి, అవార్డు కు ప్రతిపాదించాలని సూచించారు. తక్షణమే పేర్లు పంపాలని ఆమె కోరారు.

      ఈ కార్యక్రమంలో ఉప కలెక్టర్ లవన్న, డిపిఓ ప్రభాకర్ రావు, గుంటూరు జెడ్పి డిప్యూటీ సిఈఓ కృష్ణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker