ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026 జనవరిలో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సారస్వత పరిషత్తు ప్రతినిధులు గజల్ శ్రీనివాస్, రామచంద్ర రాజు, వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర తదితరులు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తెలుగు కీర్తి కిరీటాన్ని ప్రపంచానికి వ్యాపింప చేసిన వారిని గుర్తించుకోవాలని అన్నారు.
తెలుగు భాషను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడతాయని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం అయ్యేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు.