Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

పోలవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నకిలీ మద్యంపై నిరసన దీక్ష

పోలవరం, అక్టోబర్ 12:ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం మహమ్మారి లాంటి భయంకర పరిస్థితిని తీసుకువచ్చిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అక్టోబర్ 13న సోమవారం ఉదయం 9:30 గంటలకు పోలవరం నియోజకవర్గంలోని పోలవరం మండలంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తెల్లం బాలరాజు హాజరవుతారు. అదనంగా మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు సభ్యులు సహా పార్టీకి చెందిన వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయిప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వం, నకిలీ మద్యం తయారీకి అనుకూల వాతావరణం కల్పించడం దారుణమని, దీనిపై ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే ఈ నిరసన చేపడుతున్నట్లు నేతలు పేర్కొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button