
NTR విజయవాడ: 17-10-25:- విజయవాడతూర్పు నియోజకవర్గంలోని 22వ డివిజన్లో శుక్రవారం రోజున కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవుని అవినాష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకుండా అడ్డుకోవడమే ఈ సంతకాల సేకరణ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కృషి చేశారని అన్నారు.అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దాంతో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారుకోటి సంతకాల సేకరణ అనంతరం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ను స్వయంగా కలిసి ప్రజాభిప్రాయాన్ని తెలియజేస్తారని, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







