chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur news ప్రజలకు ప్రతి రూపాయి ఖర్చు పై లెక్క చెప్పి తీరాలి— ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు:23-10-25:- గుంటూరుమున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి నగర అభివృద్ధి పనులపై ఖర్చుల విషయంలో పారదర్శకత లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్కడ ఎంత ఖర్చు జరుగుతుందో ఎవరికి తెలియదు. మొక్కల నాటడం కోసం 55 లక్షలు అన్నారు, ఇంకొక పనికి 80 లక్షలు అన్నారు, కానీ లెక్కలు స్పష్టంగా లేవు. డీసిల్టేషన్ పనుల బిల్లులు చెల్లించటం లేదు.

కొన్ని పనులు పూర్తికాకపోయినా బిల్లులు క్లియర్ అవుతున్నాయి. నా నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల వర్కులు జరిగితే, ఇప్పటివరకు కేవలం రెండు కోట్ల రూపాయలకే బిల్లులు క్లియర్ అయ్యాయి. మిగతా నిధుల పరిస్థితి తెలియదు, అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులుగా ఖర్చుల వివరాలు తెలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తూ, “మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి. పేపర్ల ద్వారానైనా, లేక పోర్టల్ రూపంలో అయినా నగరంలో ఎక్కడ ఎంత నిధులు ఖర్చవుతున్నాయో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. మూడొందల మంది కాంట్రాక్టర్లు ఇప్పటికీ పోర్టల్‌లో నమోదు కాలేదు. కొందరికి ఆమోదం రాలేదు, ఇంకొందరికి బిల్లులు స్టేజీలోనే నిలిచిపోయాయన్నారు. ప్రజల డబ్బు ఎక్కడికి వెళ్తుందో, తెలియాలని, మనం ప్రజలకు జవాబుదారితనంగా, ఉండాలని తదుపరి కౌన్సిల్ సమావేశానికి ముందే ఆదాయం, ఖర్చు, వర్కుల వివరాలను పూర్తి పారదర్శకతతో సభ ముందుంచాలని గళ్ళా మాధవి డిమాండ్ చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker