
గుంటూరు: నవంబరు 21:-జిల్లాలో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి జేడీతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరై వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ—పట్టణం సహా జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి విభాగం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిచేలా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజా వలి, రవాణాశాఖ ఉప కమిషనర్ సీతారామరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.







