
బాపట్ల | ఫిబ్రవరి 4, 2026 :-ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ బహుమతులు అందజేశారు.

బుధవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఇటువంటి పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులపై చిన్నతనంలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ విజయమ్మ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.Bapatla Local News :రేపల్లె మండల రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతి విజేతలైన విద్యార్థులను అధికారులు అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు.










