Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Krishna news: ప్రతి ఒక్క రైతునుకూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది-ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

పెనుగంచిప్రోలు, అక్టోబర్ 31:మోంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్క రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య హామీ ఇచ్చారు.పెనుగంచిప్రోలు గ్రామ పరిధిలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులను ఆయన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “మోంథా తుఫాన్ తీవ్రతతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి ఎకరా నష్టాన్ని అధికారులు ఎమ్మార్వో సమక్షంలో గుర్తించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి రైతుకు తగిన నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటుంది” అని తెలిపారు.

పెనుగంచిప్రోలు నుండి ముచ్చింతాల వరకు రహదారి వరదలతో దెబ్బతిన్న నేపథ్యంలో, ముచ్చింతాల గ్రామంలోని స్థానిక నాయకులు స్వయంగా మట్టిని తోలించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేసినందుకు ఎమ్మెల్యే వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య, ఎమ్మార్వో, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button