Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Mangalagiri news:పుస్తకాలే శక్తి – బాలలే భవిష్యత్తు శిల్పులు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో డా. ఆనందరావు

మంగళగిరి: నవంబర్ 14:-58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవ వేడుకలు మంగళగిరి రాజీవ్ సెంటర్‌లోని గుర్రం జాషువా భవనంలో శుక్రవారం సంబర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సి.కే. జూనియర్ కళాశాల లెక్చరర్ డాక్టర్ ఎన్. ఆనందరావు నెహ్రూ, అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డా. ఆనందరావు, “పుస్తకాలే శక్తి… బాలలే రేపటి భవిష్యత్తు శిల్పులు” అని పేర్కొన్నారు. నేటి చిన్నారుల విజన్, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే ప్రధాన శక్తి అని చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో చెప్పినట్లుగా దేశ అభివృద్ధికి శాస్త్రీయ దృక్పథం కీలకమని గుర్తుచేశారు.అలాగే, ఆంధ్రప్రదేశ్ విద్య–ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్ర ప్రగతికి సైంటిఫిక్ టెంపర్ అవసరమని అనేక వేదికల్లో స్పష్టంచేశారని తెలిపారు.కార్యక్రమంలో వార్డు సచివాలయ సిబ్బంది, గ్రంథాలయ ఉద్యోగులు, పాఠకులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button