chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

raastra prajalaku dipawali రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి, అక్టోబర్ 19 :-రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.దీపావళి అంధకారంపై వెలుగు విజయం సాధించిన పండుగగా పేర్కొన్న మంత్రి, ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నింపాలని ఆకాంక్షించారు.ఈ దీపావళి ప్రతి ఇంటికి వెలుగుతో పాటు ఆశ, అభివృద్ధి, సంక్షేమం తీసుకురావాలని కోరిన ఆయన, రాష్ట్రం మళ్లీ వెలుగులా ప్రకాశించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, కూటమి ప్రభుత్వ కృషి పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రతి నిర్ణయం ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రైతులు, యువత, మహిళలు, వృద్ధులు తదితర వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని వివరించారు.సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం తిరిగి అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని, సాంకేతికత, విద్య, వ్యవసాయం, పరిశ్రమ తదితర రంగాల్లో ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన అన్నారు. ప్రజల విశ్వాసం కూటమి ప్రభుత్వానికి బలమని, ప్రతి ఇంట్లో దీపాలు వెలిగేలా ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులా మారి, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు మంత్రి అచ్చెన్నాయుడు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker