Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

Hyderabad Local News :రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలంటూ బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్

హైదరాబాద్:30-11-25:-రాష్ట్రంలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సివిల్ సప్లయ్ శాఖ అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 మంది రైస్ మిల్లర్లకు, వనపర్తి జిల్లాలో 36 మంది మిల్లర్లకు సీఎంఆర్ కేటాయించకుండా అధికారులు అనవసర ఇబ్బందులు పెడుతున్నారని యుగంధర్ గౌడ్ ఆరోపించారు. గతంలో కెపాసిటీకి మించి కేటాయింపులు చేసినప్పటికీ, ఆలస్యమైనా మొత్తం సీఎంఆర్ అప్పగించారని, అయితే ఇప్పుడు ఢిఫాల్టులు ఎందుకు పెడుతున్నారో అధికారులు స్పష్టత ఇవ్వాలన్నారు.

సీఎంఆర్ అందించిన రెండేళ్ల తర్వాత 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ విధించడం ఏ న్యాయమని ప్రశ్నించారు. అప్పుడే పెనాల్టీ వేయకుండా రెండు సంవత్సరాలు గడిచాక జరిమానాలు విధించి, వడ్డీతో కలిసి చెల్లించాలని ఒత్తిడి చేయడం అభాసుపాలమని వ్యాఖ్యానించారు.“సీఎంఆర్ ఇవ్వకపోతే ఢిఫాల్ట్ పెట్టండి… కానీ ఇచ్చిన తర్వాత ఢిఫాల్ట్ పెట్టడం అన్యాయం” అని యుగంధర్ గౌడ్ అన్నారు. ముందుగా ధాన్యం ఇస్తామని చెప్పి, బ్యాంకు గ్యారంటీలు తీసుకుని తర్వాత కేటాయింపులు ఆపేయడంలో దాగిన ఉద్దేశం ఏమిటో అధికారులే చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యపై త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలను కలిసి నివేదిస్తామని వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker