Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

Raithanna- meekosam :రైతన్నా- మీకోసం కార్యక్రమం నిర్వహించిన గుడివాడ ఎమ్మెల్యే రాము

Krishna :గుడివాడ రూరల్:29-11-25:- మండలం దొండపాడు గ్రామంలో రైతుల కోసం నిర్వహించిన ‘రైతన్నా… మీకోసం’ కార్యక్రమం శనివారం ఉత్సాహంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి దొండపాడు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పంచ సూత్రాలు– నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు–పై రైతులకు ఎమ్మెల్యే రాము వివరంగా అవగాహన కల్పించారు. పంటల లాభదాయకత పెంచడం, వ్యవసాయాన్ని స్థిరమైన ఆదాయం వచ్చే రంగంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

వైసీపీ గత ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం గణనీయంగా దెబ్బతిన్నదని, రైతులకు ఎదురైన ఇబ్బందులను ప్రభుత్వ నిర్లక్ష్యమే పెంచిందని రాము విమర్శించారు. కొత్త ప్రభుత్వం చేపట్టిన పంచసూత్రాలు వ్యవసాయ పునర్నిర్మాణానికి బాటలు వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమానికి హాజరైన రైతులకు ‘రైతన్న సేవలో – మన మంచి ప్రభుత్వం’ పత్రికలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం రైతుల ప్రయోజనం కోసం 30 క్వింటాళ్ల మినుము విత్తనాలను ఉచితంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్‌యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టిడిపి నేతలు చేకూరు జగన్మోహనరావు, బ్యాంక్ చైర్మన్ ముసునూరి రాజేంద్రప్రసాద్, ముత్తినేని అమరబాబు, లింగంనేని వీరబసవయ్య మరియు పలువురు నేతలు పాల్గొన్నారు. MPDO విష్ణు ప్రసాద్, ADA కవిత, AO అనంతలక్ష్మి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ సౌజన్య తదితర అధికారులు కూడా హాజరయ్యారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker