Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Raithulaku 10.5 kottulu:రైతులకు ₹10.5 కోట్లు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)


ఎన్టీఆర్ జిల్లా:జగ్గయ్యపేట:04-11-25:-పట్టణంలోని సాయి తిరుమల కోల్డ్‌స్టోరేజ్‌లో సుమారు ఏడు నెలల క్రితం సంభవించిన అగ్నిప్రమాదంలో మిర్చి, అపరాలు పూర్తిగా కాలిపోయి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో కోల్డ్‌స్టోరేజ్ భవనం కూడా పూర్తిగా ధ్వంసమైంది.మొత్తం 207 మంది రైతులు నష్టపోయిన ఈ ఘటనలో వారికి న్యాయం చేయించేందుకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కీలక పాత్ర పోషించారు. ఆయన నిరంతర కృషి, పట్టుదలతో కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం నుంచి మొత్తం రూ.10.5 కోట్లు నష్టపరిహారంగా రైతులకు చెల్లింపులు జరిగాయి.

ఇన్సూరెన్స్ రిన్యువల్ చేయని పరిస్థితుల్లో కూడా యాజమాన్యం స్వయంగా రైతులకు పరిహారం అందించడం విశేషంగా నిలిచింది. రాష్ట్రంలో ఇంతవరకు కోల్డ్‌స్టోరేజ్ అగ్నిప్రమాదంలో రైతులకు నష్టపరిహారం అందించిన మొదటి ఘటనగా ఇది చరిత్ర సృష్టించింది.ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే రాజగోపాల్ తాతయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, “రైతుల వెన్నంటే నిలబడ్డ నిజమైన ప్రజా ప్రతినిధి” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button